YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పటేల్‌ అడుగుజాడల్లోనే మోదీ ప్రభుత్వం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

 పటేల్‌ అడుగుజాడల్లోనే మోదీ ప్రభుత్వం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అడుగుజాడల్లోనే మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. పటేల్‌ ఆశయాలతోనే ముందుకెళ్తామని స్పష్టం చేశారు.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి భాద్యతలు చేపట్టిన అనంతరం నగరానికి వచ్చిన కిషన్ రెడ్డి శనివారం అసంబ్లీ  ఎదురుగా ఉన్న ఉన్న సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ విగ్రహానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పటేల్‌ కృషి వల్లే నిజాం కబంధహస్తాల్లో ఉన్న హైదరాబాద్‌ రాజ్యం భారత్‌లో విలీనమైందని గుర్తు చేశారు.

Related Posts