YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

1970 తర్వాత 2018లోనే మహిళ ఆర్థిక మంత్రి

1970 తర్వాత 2018లోనే మహిళ ఆర్థిక మంత్రి

మోదీ ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమౌతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌ను జూలై 5న ప్రవేశపెట్టబోతున్నారు. దేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతోన్న రెండో మహిళా ఆర్థిక మంత్రి ఈమె. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఒక్కరే మహిళా ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెజ్‌ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పడి దాకా మరెవ్వరూ కూడా మహిళా ఆర్థిక మంత్రి కాలేదు. అలాగే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేదు. ఇందిరా గాంధీ 1970-71లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా రాజీనామా చేయడంతో ఆహె ఈ బాధ్యతలు స్వీకరించారు. ఈమె 1970లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి చూస్తే ఇప్పటికి 48 ఏళ్లు గడిచిపోయాయి

Related Posts