Highlights
- దేశ రాజకీయాల్లో మార్పు అవసరం
- థర్డ్ ఫ్రంట్ కావొచ్చు, మరో ఫ్రంట్ కావొచ్చు కేసీఆర్
దేశంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పథకాల పేరు మార్చడం మినహా కాంగ్రెస్, బీజేపీ ఎవరొచ్చినా క్షేత్రస్థాయి పరిస్థితుల్లో మార్పు జరగలేదన్నారు. శనివారం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు.భారత రాజకీయాల్లో మార్పు కోసం కొత్త ప్రయాత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. థర్డ్ ఫ్రంట్ కావొచ్చు, మరో ఫ్రంట్ కావొచ్చు, కేంద్రంలో గుణాత్మకమైన మార్పు రావాలని సీఎం పేర్కొన్నారు.పరిస్థితులు వచ్చినప్పుడు నాయకుడు పుడతాడు. మార్పు విషయంలో నాయకత్వం వహించాల్సి వస్తే ఖచ్చితంగా వహిస్తానని వెల్లడించారు.రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడుతున్నట్లు చెప్పారు.ప్రస్తుత రాజకీయ వ్యవస్థ దారుణంగా విఫలమైందని.. దేశ రాజకీయాల్లో ప్రబలమైన మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశ రాజకీయాల్లో ప్రబలమైన మార్పు కోసం ప్రయత్నిస్తానని కేసీఆర్ తెలిపారు. కేంద్ర బడ్జెట్, జీఎస్టీ, ఎన్డీయేకు మద్దతు, ఏపీకి ప్రత్యేక హోదా వంటి తదితర అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానమిచ్చారు.