YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

 టచ్ చేస్తే భస్మం..

Highlights

  • బీజేపీ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి-- కేసీఆర్
 టచ్ చేస్తే భస్మం..

జైలుకు పంపిస్తామని కొందరు వెర్రి కూతలు కూస్తున్నారు.. ఒకసారి తనను టచ్ చేసి చూస్తే భస్మం అయిపోతారని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. శనివారం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రగతి భవన్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.  బీజేపీ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి' అని కేసీఆర్ అన్నారు. తాను అందరితో పారదర్శకంగా వ్యవహరిస్తానని, తమ ఆస్తులు ఏమిటో ఐటీ రిటర్న్స్లో చూసుకోవచ్చని అన్నారు. జేబులో ఉన్న పెన్నుతో సహా తన దగ్గర లెక్కలున్నాయని చెప్పారు. తమ ఆస్తులు ఏమిటో ఐటీ రిటర్న్స్లో చూసుకోవచ్చని అన్నారు. ప్రధానిని తూలనాడానని అనడం శుద్ధ తప్పు. లేనిపోనివి చేసి మాట్లాడుతున్నారు.  ప్రధాని నరేంద్రమోదీని తాను ఏమీ అనలేదని, మోదీ గారికి అనే అన్నానే తప్ప గాడు అనలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఒక వేళ తాను అలా అన్నాననుకొని బీజేపీ వాళ్లు అలా ఊహించుకుంటే వాళ్ల ఖర్మ అని కేసీఆర్ చెప్పారు. ప్రధానిని విమర్శించొద్దని రాజ్యాంగంలో ఉందా అని ప్రశ్నించారు. తాను తెలంగాణ భాషనే మాట్లాడుతున్నానని, కొత్తగా ఏమీ మాట్లాడటం లేదని జోకులు కాకపోతే తెలంగాణలో అసలు బీజేపీ ఉందా అని ప్రశ్నించారు.
.

Related Posts