YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’కి ప్రజలు మద్దతిచ్చారు

Highlights

  • ప్రజలకు కృతజ్ఞతలు తెల్పిన ప్రధాని
  • ఈశాన్య ప్రజల కలలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉంటా
  • ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’కి ప్రజలు మద్దతిచ్చారు
  • భారతీయులు తమ అభివృద్ధి ఎజెండాపై నమ్మకం ఉంచారు
  • ప్రజలకు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెల్పిన ప్రధాని మోడీ 
‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’కి ప్రజలు మద్దతిచ్చారు

తమ ప్రభుత్వం ప్రకటించిన ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’, సుపరిపాలనల అంశాలకు ప్రజలు మద్దతిచ్చారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారతీయులు తమ అభివృద్ధి ఎజెండాపై నమ్మకం ఉంచారని, అందుకే తమకు పట్టం గడుతున్నారని అన్నారు. వరుస విజయాలతో దూసుకుపోతోన్న భారతీయ జనతా పార్టీ త్రిపుర, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంపై స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆయా రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈశాన్య భారతదేశంలోని ప్రజల కలలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని పేర్కొన్నారు.

Related Posts