YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భక్తుల సేవనే మాకు పరమావధి-అమర్ నాథ్ సేవ సమితి

భక్తుల సేవనే మాకు పరమావధి-అమర్ నాథ్ సేవ సమితి

భక్తుల సేవనే పరమావధి గముందుకు సాగుతుందని అమర్ నాథ్ సేవసమితి అధ్యక్షుడు చీకోటి మధుసూదన్ వెల్లడించారు.  ఈ నెల 15 తేధీన   సిద్దిపేట లోని శరభే శ్వర ఆలయం నుండి శివ కల్యాణం అనంతరం ఆహార పదార్థ ల లారీని బల్తాల్ కు పంపుతున్నామని సిద్దిపేట లో ఏర్పాటు చేసిన విలేకరుల విలేకరుల సమావేశం లో అమర్ నాథ్ అన్నదాన  సేవసమితి అధ్యక్షుడు చీకోటి మధుసూదన్ తెలిపారు..ఇది తొమ్మిదవ సంవత్సరం పంపుతున్నామని అన్నదానం మహాదానం అని ఎన్ని అటుపోటు లెదురైన కూడా  దక్షిణ భారతదేశం లొనే మా సమితి ఎన్నో సేవకార్యక్రమలు చేస్తున్నదని  జూలై 1 వతేది నుండి ఆగస్టు 15 వ తేదీ వరకు 45 రోజులు  ఈ సేవ ను  నిర్వహిస్తామని 200 మంది భక్తులు ఉచితంగా బస చేసే విధంగా  ఏర్పాటు చేశామని ఈ కార్యక్రమానికి సిద్దిపేట ఎమ్మెల్య్ హరీష్ రావు,ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్ రెడ్డి,జిల్లా పరిషత్ చైర్మన్ రోజాశర్మ,కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, మొదలగువారు హాజరవుతారని పర్వత శిఖరాలలో భోజన సదుపాయం కల్పించడం గొప్ప దైవకార్యం అని అన్నదానం ప్రాణదానం తో సమానమని ప్రతీ ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని దీనిని అమృత్ సర్ ,లూథియానా సహకారం తో నిర్వహిస్తున్నామని మంచు లింగం  పూర్తి గా కరిగి పోయేంత వరకు మాసేవ కొనసాగుతుందనిఅన్నారు. ఈ విలేఖరుల సమావేశం లో కాచం కాశినాథ్,ఐత రత్నాకర్,బుచ్చయ్య,శరభయ్,మంకాల నవీన్ కుమార్..తదితరులు పాల్గొన్నారు.

Related Posts