YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

యూపీలో అమిత్ షా మామిడి పండ్లు...

 యూపీలో అమిత్ షా మామిడి పండ్లు...

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేరుతో మామిడి పండ్లు వచ్చే్స్తున్నాయ్. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ తర్వాత అమిత్‌షాకు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని మలిహబాద్‌కు చెందిన ‘మ్యాంగో మ్యాన్’ హజీ కలిముల్లా రూపొందించిన సరికొత్త మామిడి పండ్లకు ‘షా’ అని పేరు పెట్టారు. ‘మంచి బరువు, రుచి ఉండే ఈ మామిడి పండుకు ‘షా’ పేరు పెట్టారు. ఈ సరికొత్త మామిడి వంగడాన్ని త్వరలోనే మార్కెట్లో విక్రయిస్తాం. ఈ మామిడి పండు తప్పకుండా ఆయనకు నచ్చుతుంది’’ అని తెలిపారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత కలిముల్లా విభిన్న రకాల మామిడి వంగడాలను పండిస్తూ గుర్తింపు పొందారు. 2015లో ఓ అరుదైన మామిడి పండుకు ఆయన ప్రధాని మోదీ పేరు పెట్టారు. ఆయన తోటలో ఒకే చెట్టుకు 300 రకాల మామిడి పండ్లు కాస్తున్నాయంటే.. అతను ఎంత క్రియేటివ్‌గా మామిడి వంగడాలను సృష్టిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.

Related Posts