YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కశ్మీర్ కాదు.. కోహ్లీ కావాలి

 కశ్మీర్ కాదు.. కోహ్లీ కావాలి

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చావుదెబ్బ తిన్న పాకిస్థాన్ నుంచి వింత ప్రతిపాదన సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మాంచెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఆధిపత్యం చెలాయించిన టీమిండియా.. 89 పరుగుల తేడాతో పాక్‌ని డక్వర్త్ లూయిస్ పద్ధతిలో చిత్తుగా ఓడించేసిన విషయం తెలిసిందే.
మ్యాచ్‌లో తుది జట్టు ఎంపిక నుంచి బ్యాటింగ్ ఆర్డర్‌లో అనూహ్య మార్పులు చేసిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి (77: 65 బంతుల్లో 7x4).. పట్టుదలతో 48వ ఓవర్ వరకూ క్రీజులో నిలిచి టీమ్‌కి 336 పరుగుల మెరుగైన స్కోరు అందించాడు. ఆ తర్వాత ఛేదనలో పాక్ ఆటతీరుకి అనుగుణంగా బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ కూర్పులు చేసిన విరాట్ కోహ్లీ.. కెప్టెన్‌గానూ సక్సెస్ అయ్యాడు. మరోవైపు పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పేలవ కెప్టెన్సీతో ఆ జట్టు ఓటమికి కారణమయ్యాడు. దీంతో.. ఇప్పుడు ‘మాకు కాశ్మీర్ వద్దు.. విరాట్ కోహ్లీని ఇవ్వండి’ అని పాకిస్థాన్ అభిమానులు వింత ప్రతిపాదనని తెరపైకి తీసుకొస్తున్నారు. మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ (140: 113 బంతుల్లో 14x4, 3x6) శతకానికి కెప్టెన్ విరాట్ కోహ్లి , కేఎల్ రాహుల్ (57: 78 బంతుల్లో 3x4, 2x6) మెరుపులు తోడవడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో మహ్మల్ అమీర్ మూడు వికెట్లు పడగొట్టగా.. హసన్ అలీ, వాహబ్ రియాజ్ చెరో వికెట్ తీశారు. అనంతరం పాకిస్థాన్ జట్టు ఛేదనకు దిగగా.. కొద్దిసేపటికే వర్షం రావడంతో మ్యాచ్‌ని 40 ఓవర్లకి కుదించిన అంపైర్లు.. టార్గెట్‌ని 302 పరుగులుగా సవరించారు. ఆ జట్టులో బాబర్ అజామ్ (48: 57 బంతుల్లో 3x4, 1x6), ఫకార్ జమాన్ (62: 75 బంతుల్లో 7x4, 1x6) కాసేపు నిలకడగా ఆడినా.. ఆ తర్వాత వచ్చిన మహ్మద్ హఫీజ్ (9), సర్ఫరాజ్ అహ్మద్ (12: 30 బంతుల్లో), షోయబ్ మాలిక్ (0) తక్కువ స్కోరుకే ఔటవడంతో పాక్ ఓటమి ఖాయమైంది. ఆఖర్లో ఇమాద్ వసీమ్ (46 నాటౌట్: 39 బంతుల్లో 6x) కాసేపు నిలకడగా ఆడి ఆ జట్టు ఓటమి అంతరాన్ని కాస్త తగ్గించాడు. భారత్ బౌలర్లలో విజయ్ శంకర్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

Related Posts