Highlights
- టేకాఫ్ అయితే ప్రమాదమే..
హైదరాబాద్ శంషాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో సిబ్బంది సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పింది. దీనితో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం జెడ్డా నుంచి ఇండోనేషియా వెళ్తున్నా సిటీ లింక్ ఎయిర్ లైన్స్ విమానంలో ఇంధనం అయిపోవడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టు లో అత్యవసర ల్యాండింగ్ చేశారు ఫైలట్. తిరిగి విమానంలో ఇంధనం నింపుతుండగా ఒక్కసారి ఇంధనం లీకైంది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది. వెంటనే విమానాన్ని నిలిపివేసి లీకేజ్ గమనించి రన్వే పై బడిన పడిన ఇంధనాన్ని ఫైరింజన్ తో క్లీన్ చేసిన సిబ్బంది. అదే విమానం టేకాఫ్ అయితే మాత్రం పెద్ద ప్రమాదం జరిగి ఉండేది.