YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

 థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు దేశవ్యాప్తంగా స్పందన    

Highlights

 సీఎం  మమతా బెనర్జీ నాకు ఫోన్ చేశారు

కాంగ్రెస్, బీజేపీల విఫలం స్పష్టమైంది 

70 ఏళ్ల తర్వాత కూడా దేశంలో

రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరగాలి? 

నిలదీసిన కేసీఆర్

 థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు దేశవ్యాప్తంగా స్పందన    

దేశ రాజకీయాల్లో సంపూర్ణ మార్పు రావాల్సి ఉందన్న నా వాదనకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు  ప్రకటించారని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు తెలిపారు. నా వెంటే నడుస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం  హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కేసీఆర్ ని కలిసి పలు రంగాలకు చెందిన ప్రముఖులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ...అదేవిధంగా. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్ కూడా ఫోన్ చేశారు. జాతీయ స్థాయిలో మరో కూటమి ఏర్పాటు అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు ఎంపీలు మద్దతు పలికారు, కాంగ్రెస్, బీజేపీ నాయకత్వాలు విఫలమైన విషయం ప్రజలకు అర్థమైంది. 70 ఏళ్ల తర్వాత కూడా దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరగాలి? చాలా విషయాలు పెండింగ్ లో ఉన్నాయి. ఏ కులమైనా, మతమైనా అందరం బాగుండాలి’అని కేసీఆర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
అవసరమైతే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానన్న తన ప్రకటనపై దేశ వ్యాప్తంగా పలువురు స్పందించారని, దేశం నలుమూలల నుంచి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు.
 

Related Posts