YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లాభాల్లో స్టాక్ మార్కెట్

 లాభాల్లో స్టాక్ మార్కెట్

ఇండియన్ స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల్లో ముగిసింది. దీంతో సూచీల నాలుగు రోజుల నష్టాలకు బ్రేకులు పడ్డాయి. సెన్సెక్స్ 86 పాయింట్ల లాభంతో 39,046 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 11,691 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.ఫార్మా షేర్లపై ఒత్తిడి నెలకొంది. ఆటో రంగ షేర్లు కూడా నష్టపోతూనే వస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాలు జరిగాయి. అయితే ఐటీ షేర్లు మాత్రం లాభపడ్డాయి. బ్యాంకు షేర్లలోనూ కొనుగోళ్లను గమనించొచ్చు.
మార్కెట్ హైలైట్స్..
✺ నిఫ్టీ 50లో వేదాంత, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. వేదాంత దాదాపు 2 శాతానికి పైగా పెరిగింది.
✺ అదేసమయంలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, యస్ బ్యాంక్, హిందాల్కో, ఏసియన్ పెయింట్స్, సన్ ఫార్మా షేర్లు నష్టపోయాయి. ఇండియాబుల్స్ ఏకంగా 7 శాతానికి పైగా పడిపోయింది.
✺ నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్లన్నీ మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ మెటల్ ఇండెక్స్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ దాదాపు 1 శాతం నష్టపోయింది.
✺ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 0.64 శాతం తగ్గుదలతో 60.56 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్కు 0.38 శాతం తగ్గుదలతో 51.97 డాలర్లకు దిగొచ్చింది.
✺ అమెరికా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి లాభాల్లో ట్రేడవుతోంది. 24 పైసలు పెరుగుదలతో 69.66 వద్ద ఉంది.
✺ జెట్ ఎయిర్వేస్ షేరు 40 శాతం పడిపోయింది. దివాల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం ఎన్సీఎల్టీకి వెళ్లడం ఇందుకు కారణం.

Related Posts