YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లక్ష క్యాంపులతో పతంజలి రికార్డ్

 లక్ష క్యాంపులతో  పతంజలి రికార్డ్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబాకు చెందిన ‘పతంజలి’ సంస్థ సరికొత్త రికార్డును సృష్టించేందుకు సిద్ధమవుతోంది. కనీవినీ ఎరుగని స్థాయిలో శుక్రవారం దేశంలోని లక్ష గ్రామాల్లో యోగా శిబిరాలు నిర్వహించింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రామ్‌దేవ్ బాబా తెలిపారు. దేశంలో సుమారు లక్ష గ్రామాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించామని.. కులమతాలకు అతీతంగా యోగాను నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది మన పూర్వికుల నుంచి లభించిన అతి గొప్ప వరం యోగా. దీనికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన మోదీకి దన్యవాదాలన్నారు. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత యోగాను ప్రజల్లోకి తీసుకెళ్లిన ఏకైక ప్రధాని.. నరేంద్ర మోదీ. ఆయన ప్రయత్నం వల్లే 177 దేశాల మద్దతుతో ఐక్యరాజ్య సమితి ‘అంతర్జాతీయ యోగా దినం’ ప్రకటించింది’’ అని రాందేవ్ తెలిపారు.  మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్‌తో కలిసి నాందేడ్‌లో భారీ స్థాయిలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన తనతో కలిసి రెండు గంటల సేపు యోగా చేశారు. ఇతర ప్రాంతాల్లో జరిగే యోగా కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొంటారన్నారు.

Related Posts