YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఏఎన్-32 విమానం మృతులకు రాజ్‌నాథ్ సింగ్ నివాళ్ళు

ఏఎన్-32 విమానం మృతులకు రాజ్‌నాథ్ సింగ్ నివాళ్ళు

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన ఏఎన్-32 విమానం కూలిపోయిన దుర్ఘటనలో మరణించిన 13 మంది పార్థివదేహాలకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు. బుధవారం ఆరుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న ఐఏఎఫ్.. గురువారం మరో ఏడుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నది. ఈ నెల 3వ తేదీన గల్లంతైన వాయుసేనకు చెందిన ఏఎన్-32 విమానం అరుణాచల్‌ప్రదేశ్‌లోని సియాంగ్ జిల్లా పయూమ్ పరిధిలో కూలిపోయిన సంగతి తెలిసిందే. విమానంలో ప్రయాణిస్తున్న 13 మంది మృతి చెందారు.

Related Posts