YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మేఘాలయాలో చిత్తైన 'హస్తం'

Highlights

  • 21 సీట్లు సాధించినా దక్కని అధికారం
  • 2 సీట్లున్న బీజేపీ వ్యూహంలో విలవిల
  • 6న కాన్‌రాడ్ సంగ్మా సీఎంగా ప్రమాణ స్వీకారం
     
మేఘాలయాలో చిత్తైన 'హస్తం'

కేవలం రెండు సీట్లు సాధించిన బీజేపీ రాజకీయ వ్యూహాంలో చిక్కున్న కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. మేఘాలయలో  అతిపెద్ద పార్టీగా అవతరించినా భంగపాటు తప్పలేదు. కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు పావులు కదిపిన బీజేపీ.. తనలాగే సింగిల్ డిజిట్ స్థానాలను దక్కించుకున్నపార్టీలను ఏకతాటిమీదకు తీసుకురావడంలో సఫలీకృతమైంది. దీనితో  తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 21 సీట్లు సాధించగా, లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా కుమారుడు కాన్‌రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) 19 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ను  అడ్డుకునే క్రమంలో బీజేపీ.. తనలాగే సింగిల్ డిజిట్ స్థానాలను దక్కించుకున్న యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (యూడీపీ), హెచ్ఎస్ పీడీపీ, పీడీఎఫ్‌లను ఏకం చేసి ఎన్‌పీపీకి మద్దతు ఇచ్చేలా ఒప్పించింది. దీంతో ఎన్‌పీపీ బలం 34కు పెరిగింది. ఫలితంగా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం సమకూరింది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కాన్‌రాడ్ సంగ్మాను గవర్నర్ గంగా ప్రసాద్ ఆహ్వానించారు. మంగళవారం సంగ్మా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం సాయంత్రం గవర్నర్‌ను కలిసిన సంగ్మా తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల జాబితాను అందించారు.

Related Posts