YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

భారీగా పెరిగిన బంగారం ధరలు

భారీగా పెరిగిన బంగారం ధరలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

పసిడి ధర అడ్డూఅదపు లేకుండా పరుగులు పెడుతూనే ఉంది. హైదరాబాద్‌లో బుధవారం  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.470 పెరుగుదలతో రూ.36,080కు ఎగసింది. అంతర్జాతీయ ట్రెండ్ సానుకూలముగా లేకున్నా కూడా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడం పసిడి ధరపై సానుకూల ప్రభావం చూపింది. అదే సమయంలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.430 పెరుగుదలతో రూ.33,080కు చేరింది. మరోవైపు కేజీ వెండి ధర కేవలం రూ.5 తగ్గుదలతో రూ.40,355కు క్షీణించింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ పసిడి, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. ఇక ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.34,550 వద్ద కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా స్థిరంగా రూ.33,350 వద్ద ఉంది. కేజీ వెండి ధర రూ.5 తగ్గుదలతో రూ.40,355కు క్షీణించింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. అయినా కూడా బంగారం ధర ఔన్స్‌కు 1,400 డాలర్ల మార్క్ పైనే కదలాడుతోంది. బుధవారం ఔన్స్ పసిడి ధర 0.27 శాతం తగ్గుదలతో 1,414.75 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.25 శాతం క్షీణతతో 15.25 డాలర్లకు దిగొచ్చింది. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Related Posts