YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

హోదా కోసం హోరెత్తుతున్న హస్తిన!

Highlights

  • ‘ప్యాకేజీతో మోసం చేయొద్దు.
  •  ప్రత్యేక హోదా మన హక్కు
  • హోరెత్తిన నినాదాలు 
  • వైసీపీ ఎంపీలను అరెస్టు చేసిన పోలీసులు 
హోదా కోసం హోరెత్తుతున్న హస్తిన!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి  ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వేదికగా చేపట్టిన సోమవారం పతాక స్థాయికి చేరింది. ఆ పార్టీ ఎంపీల అరెస్టులతో ఢిల్లీ వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలో ఆ పార్టీ తన పోరాటాన్ని మరింత ముమ్మరం చేసింది. ‘ప్యాకేజీతో మోసం చేయొద్దు.. ప్రత్యేక హోదా మన హక్కు’’ అన్న నినాదంతో వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్యనేతలు సోమవారం ఢిల్లీలోని సంసద్మార్గ్లో మహాధర్నా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ఆవేదనను యావత్ భారతావనికి వినిపించేందుకు చేపట్టిన ఈ పోరాటంలో పార్టీ నాయకులతోపాటు శ్రేణులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు.దీంతో సంసద్మార్గ్ ప్రాంతమంతా వైఎస్సార్సీపీ శ్రేణులతో నిండిపోయింది. వైఎస్ఆర్సీపీ జెండాల రెపరెపలు.. కార్యకర్తల నినదాలతో ఆ ప్రాంతం హోరెత్తుతోంది. ‘ప్రత్యేక హోదా భిక్ష కాదు.. ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. వైఎస్సార్సీపీ శ్రేణులు ఉత్సాహంగా మహాధర్నాలో పాల్గొంటున్నారు. దీనితో ఢిల్లీ పోలీసులు ఎంపీలతో సహా ఆందోళకు దిగినవారందర్నీ అరెస్టు చేశారు. 
 

Related Posts