YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

కొనసాగుతున్న బంగారం పతనం

కొనసాగుతున్న బంగారం పతనం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:  

  కొన్ని రోజులుగా పరుగులు పెడుతూ వచ్చిన పసిడి ధరకు బ్రేకులు పడ్డాయి. మార్కెట్‌లో నేడు బంగారం ధర భారీగా పడిపోయింది. హైదరాబాద్‌లో శుక్రవారం  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.630 తగ్గుదలతో రూ.35,450కు దిగొచ్చింది. అంతర్జాతీ ట్రెండ్ సానుకూలముగా ఉన్నప్పటికీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడంతో పసిడి ధరపై ప్రతికూల ప్రభావం పడింది. అదే సమయంలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.580 తగ్గింది. రూ.32,500కు దిగొచ్చింది. మరోవైపు కేజీ వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. రూ.40,355 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ పసిడి, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. ఇక ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50 తగ్గుదలతో రూ.34,500కు క్షీణించింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.50 క్షీణతతో రూ.33,300కు తగ్గింది. ఇక కేజీ వెండి ధర రూ.40,355 వద్ద నిలకడగా కొనసాగుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పైకి కదిలింది. 1,400 డాలర్ల మార్క్ పైనే కదలాడుతోంది. శుక్రవారం ఔన్స్ పసిడి ధర 0.83 శాతం పెరుగుదలతో 1,423.65 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.25 శాతం పెరుగుదలతో 15.33 డాలర్లకు ఎగసింది. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Related Posts