YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

పిల్లలను చంపినందుకు 120 ఏళ్ల జైలు

పిల్లలను చంపినందుకు 120 ఏళ్ల జైలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:  

నవ మాసాలు కని పెంచి పిల్లలనే అతి దారుణంగా చంపేసిన కిరాతక తల్లికి అమెరికాలోని ఓ న్యాయస్థానం ఏకంగా 120 ఏళ్ల జైలుశిక్ష విధించింది. 60ఏళ్ల చొప్పు రెండు శిక్షలు విధిస్తూ.. పెరోల్ తీసుకునేందుకు వీలు లేకుండా ఆదేశాలు జారీచేసింది. నాలుగు సంవత్సరాల క్రితం ఈస్ట్ హెవెన్ పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి కోర్టు తుదితీర్పు ఇచ్చింది. ఈస్ట్‌ హెవెన్ పట్టణానికి చెందిన లి రోయా మూరే అనే మహిళ తన కుమారుడు డారన్, కుమార్తె అలీషాను 2015లో అతి దారుణంగా చంపేసింది. మృతదేహాలను మూడు రోజులు ఇంట్లోనే ఉంచింది. మూరే ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారికి అనుమానమొచ్చ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఆమె ఇంట్లో తనిఖీలు చేయగా ఇద్దరు పిల్లల మృతదేహాలు లభించాయి. పోలీసులు మూరేను అదుపులోకి తీసుకుని విచారించగా తన బిడ్డలను చంపేయాలని దేవుడు ఆదేశించాడని, వాళ్లను మళ్లీ బతికించేందుకే ఇంట్లో మృతదేహాలు దాచినట్లు చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించారు. ఈ జంట హత్యలకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు మూరేను నేరస్థురాలిగా నిరూపించారు. ఈ కేసుకు సంబంధించి గతేడాది మార్చిలోనే కోర్టు విచారణ పూర్తి చేసింది. మూరే మానసిక పరిస్థితి సరిగ్గా లేదని.. అందువల్లే తన పిల్లలను చంపుకుందని ఆమె తరపు న్యాయవాది వాదనలు వినిపించినా కోర్టు వాటిని కొట్టిపారేసింది. ఇది చాలా తీవ్రమైన నేరమని, మానసిక స్థితి పేరుతో నిందితురాలు తప్పించుకునే ఛాన్స్ ఇవ్వబోమని జడ్జి స్పష్టం చేశారు. దోషికి రెండు హత్యలకు 60ఏళ్ల చొప్పున 120ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. శిక్షా కాలంలో ఆమెకు పెరోల్ ఇవ్వరాదని ఆదేశాలు జారీచేశారు.

Related Posts