YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఇరాక్ లో రాముడి ఆనవాళ్లు

ఇరాక్ లో రాముడి ఆనవాళ్లు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

భారత్, ఇరాక్‌ల మధ్య చారిత్రంగా ఉన్న సంబంధాలకు బలం చేకూరే మరో ఆధారం లభించింది. ఇరాన్‌లోని ఓ ప్రాంతంలో రాముడి ఆనవాళ్లను భారతీయ ప్రతినిధులు గుర్తించారు. ఓ శిలపై రాముడి రూపంలో ఉన్న చిత్రాన్ని భారతీయ చరిత్రకారులు కనుగొన్నారు. ఇది దాదాపు 2 వేల ఏళ్ల కిందటిదిగా భావిస్తున్నారు. హోరేన్ షైక్ ప్రాంతంలోని దర్బాండ్ ఐ బెలూలా కొండపై ఉన్న ఈ చిత్రం రాముడిదేనని అయోధ్య శోధ్ సంస్థాన్ నమ్ముతోంది. ఓ చేతిలో విల్లు, బాణాలు, ఒరలో కత్తి ఉన్న ఆజానుబాహుడిని రాముడిగానూ, ఆయన ఎదురుగా మోకాళ్లపై ఉన్న మరో వ్యక్తిని హనుమంతుడిగానూ భావిస్తున్నామని ఏఎస్ఎస్ డైరెక్టర్ అన్నారు. ఇరాక్ పరిశోధకులు మాత్రం ఇది ఓ కొండజాతి రాజు చిత్రమని పేర్కొంటున్నారు. రాజులు ఎదుట మోకాలిపై ఉన్నవారిని ఖైదీలుగా భావిస్తామని వ్యాఖ్యానిస్తున్నారు. యూపీ ప్రభుత్వానికి చెందిన అయోధ్య శోధ్ సంస్థాన్ అభ్యర్థనతో ఇరాక్‌లో భారత రాయబారి ప్రదీప్ సింగ్ రాజ్‌పురోహిత్ ఈ ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహించారు. ఇబ్రిల్ కాన్సులేట్‌లోని రాయబారి చంద్రమౌళి కరన్, సులేమానియా యూనివర్సిటీకి చెందిన చరిత్రకారులు, ఇరాక్ ప్రభుత్వానికి చెందిన అధికారులు కూడా ఇందులో ఉన్నారు. బెలూలా కనుమలో రాముడు పోలికలకు సంబంధించిన చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ..కానీ, ఈ బృందం మాత్రం భారత్, మొసపటోమియా సంస్కృతుల మధ్య సంబంధం గురించి లోతైన అధ్యయనానికి భౌగోళిక ఆధారాలను సేకరించినట్టు ఏఎస్ఎస్ డైరెక్టర్ యోగేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. ఈ శిలపై చిత్రంలో కనిపిస్తోన్న రాజు, వానరాలను రాముడు, హనుమంతుడి అనే విషయం గుర్తుచేస్తుందన్నారు. ఇరాక్ చరిత్రకారులు, పురాతత్వశాస్త్రవేత్తలు మాత్రం దీనికి రాముడితో సంబంధం లేదని అంటున్నారు.. ఏదేమైనా ఇరాక్ ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత దీనికి గల సంబంధాన్ని అన్వేషిస్తామని అన్నారు. సింధూ లోయ, మొసపటోమియా నాగరికతల మధ్య సంబంధాలకు ఇది తొలి అధికారిక ప్రయత్నమని సింగ్ స్పష్టం చేశారు. క్రీస్తుపూర్వం 4500 నుంచి 1900 మధ్య మొసపటోమియాను పాలించిన సుమేరియన్ల మూలాలు సింధూ లోయ నాగరికతతో ముడిపడి ఉన్నాయనడానికి పలు ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఇక, యూపీ సాంస్కృతిక శాఖ సైతం ఇలాంటి విగ్రహాన్ని రూపొందించి, అయోధ్యలో ప్రతిష్ఠించే యోచనలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాముడి ప్రతిమ, చిత్రాలను అయోధ్యలో ఒకే చోట ఉంచాలని భావిస్తోంది.

Related Posts