YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేంద్రం నుంచి రూ.16 వేల కోట్లు రావాలి.. 

Highlights

  • ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే..
  • హోదా, పరిశ్రమలు, ఇతర అంశాలపై చర్చ 
  • రైల్వే జోన్ తో సహా ఇవ్వాలి
కేంద్రం నుంచి రూ.16 వేల కోట్లు రావాలి.. 

 కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రూ.16 వేల కోట్ల రెవెన్యూ లోటు రావాల్సి ఉందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.ఇతర రాష్ట్రాలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చినప్పుడు ఏపీకి కూడా ఇవ్వాలని అన్నామని తెలిపారు. సోమవారం ఢిల్లీలో సోమవారం ఏపీకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాల విషయంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో టీడీపీ నేతలు  భేటీ అయ్యారు. టీడీపీ నేతలు సుజనా చౌదరి, యనమల రామకృష్ణుడు, రామ్మోహన్ నాయుడు ఏపీ విభజన సమస్యలపై జైట్లీకి వివరించారు. భేటీ ముగిసిన అనంతరం ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేకహోదా, పరిశ్రమలకు ప్రోత్సాహకాలతో పాటు ఇతర అంశాలపై చర్చించామని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని జైట్లీకి చెప్పామని యనమల అన్నారు. రైల్వే జోన్ గురించి కూడా మాట్లాడామని, రాష్ట్ర పరిస్థితులను స్పష్టంగా వివరించామని యనమల చెప్పారు.  

Related Posts