YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లోయలో పడిన బస్సు : 35 మంది దుర్మరణం

లోయలో పడిన బస్సు : 35 మంది దుర్మరణం

కశ్మీర్‌లో విషాదం చోటు చేసుకున్నది. మినీ బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 35 మంది మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. కిష్ట్‌వార్ జిల్లాలో ఇవాళ ఉదయం 7.30 సమయంలో లోయలో పడిపోయింది. బస్సు స్కిడ్ అయి.. సిర్గ్‌వారీ వద్ద లోయలో పడిపోయినట్టు పీటీఐ రిపోర్ట్ చేసింది. చనిపోయిన వారిలో 20 మంది మృతదేహాలను వెలికితీశారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు ప్రమాద ఘటనపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.

Related Posts