YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

నష్టాల నుంచి బయటపడిన  ట్రేడింగ్.. 

నష్టాల నుంచి బయటపడిన  ట్రేడింగ్.. 

గ్లోబల్‌ మార్కెట్ల నుంచి వస్తున్న సంకేతాలు సానుకూలంగా ఉండటంతో సెన్సెక్స్‌, నిఫ్టీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. అటు ఆసియన్‌ స్టాక్స్‌ కూడా ర్యాలీ జరుపుతున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో టాటా స్టీల్‌, ఎన్‌ఎండీసీ, సెయిల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, జేఎస్‌పీఎల్‌, హిందాల్కో, వేదంతలు 1-4 శాతం లాభాలు పండించగా.. ఐడియా సెల్యులార్‌, పీఎఫ్‌సీ ఒత్తిడిలో కొనసాగాయి.ప్రారంభంలో 200 పాయింట్లు జంప్‌ చేసిన సెన్సెక్స్‌ ప్రస్తుతం 249 పాయింట్ల లాభంలో 33,995 వద్ద, నిఫ్టీ 79 పాయింట్ల లాభంలో 10,437 వద్ద కొనసాగుతున్నాయి. మొత్తం మీద ట్రేడ్‌ వార్‌ ఆందోళనలు కాస్త తగ్గుముఖం పట్టడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల నుంచి బయటపడుతున్నాయి. 
.

Related Posts