YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పిలిచి ఎందుకు రాలేదు..

Highlights

  • అమిత్ షా గైర్జారుపై ఎంపీలను ప్రశ్నించిన చంద్రబాబు
  • రెండు అంశాలు మాత్రమే చర్చకు వచ్చాయన్న తోట నరసింహం
  • ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చంద్రబాబు
  • అన్ని అంశాల్లో స్పష్టత రావాల్సిందే
  • ఎంపీలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ 
పిలిచి ఎందుకు రాలేదు..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నే న్యూఢిల్లీకి రావాలని స్వయంగా కోరి సమస్యలపై  చర్చించేందుకు ఎందుకు రాలేదని ఎంపీలను  ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నేడు ప్రశ్నించారు.మంగళవారం  ఉదయం ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, సమావేశానికి జైట్లీతో పాటు అమిత్ కూడా హాజరై ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. 
ఈ సందర్భంగా  సమావేశం వివరాలను ఎంపీ తోట నరసింహం చంద్రబాబుకు వివరించారు.నిన్నటి సమావేశంలో 'పరిశీలిస్తున్నాం, చూస్తున్నాం' అని మాత్రమే అరుణ్ జైట్లీ చెప్పారని, నిర్దిష్టమైన హామీలేవీ ఆయన్నుంచి రాలేదని ఎంపీలు చెప్పడంతో చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడబోనని స్పష్టం చేశారు. హోదా, రైల్వే జోన్ అంశాలు అసలు చర్చకే రాలేదని, కేవలం రెండు అంశాలను మాత్రమే ప్రస్తావించి, మిగతావి వాయిదా వేశారని టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఎంపీలు వెల్లడించారు. 
 కేంద్రం నుంచి అన్ని అంశాల్లో స్పష్టత రావాల్సి వుందని, స్పష్టత వచ్చేంత వరకూ పోరాటం ఆపొద్దని అయన  స్పష్టం చేశారు. రాష్ట్ర ఎంపీలకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు  పార్లమెంటులో హోదా కోసం నిరసనలు తెలియజేస్తూనే ఉండాలని సూచించారు. అన్నీ సాధించే వరకూ టీడీపీ వైఖరిలో మార్పు ఉండదని, ఈ విషయం కేంద్రానికి తెలిసేలా చేయాలని కోరారు. 
 

Related Posts