YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మధ్య తరగతికి ఊరట కానున్న బడ్జెట్ తేల్చి చెప్పిన ఆర్ధిక సర్వే

మధ్య తరగతికి ఊరట కానున్న బడ్జెట్ తేల్చి చెప్పిన ఆర్ధిక సర్వే

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని ఆవిష్కరించే కీలకమైన ఆర్థిక సర్వే 2019ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఇందులో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.
✺ మొండి బకాయిల (ఎన్‌పీఏ) తగ్గింపు కారణంగా దేశంలో మూలధన పెట్టుబడులు పెరిగే అవకాశముంది.
✺ 2019-20 ఆర్థిక సంవత్సరంలో ముడిచమురు ధరలు తగ్గొచ్చు. ఇదే జరిగితే ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంటుంది. దీంతో ప్రజలకు ఖర్చు తగ్గి.. డబ్బులు ఆదా అవుతాయి.
✺ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 7 శాతంగా నమోదు కావొచ్చు.
✺ 2019-20 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 5.8 శాతంగా ఉండొచ్చు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇది 6.4 శాతంగా ఉంది.
✺ ఆర్‌బీఐ గత పాలసీ సమావేశంలో ద్రవ్య విధానాన్ని ‘తటస్థత’ నుంచి ‘అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు’ చేసుకునే విధంగా మార్చింది. దీంతో రుణ రేట్లు దిగివచ్చే అవకాశముంది.
✺ ఆహార పదార్థాల ధరలు దిగిరావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైతుల పంట ఉత్పత్తి తగ్గొచ్చు.
✺ ఎన్నికల కారణంగా జనవరి-మార్చి మధ్యకాలంలో ఆర్థిక అభివృద్ధి కొంత నెమ్మదించింది.
✺ 2024-25 నాటిికి భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే వృద్ధి రేటు ఇప్పటి నుంచే కచ్చితంగా 8 శాతంగా నమోదు కావాలి.

Related Posts