YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేంద్ర బడ్జెట్ తో ఎవరికి లాభం ఎవరికి నష్టం?

కేంద్ర బడ్జెట్ తో ఎవరికి లాభం ఎవరికి నష్టం?

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్సభలో బడ్జెట్-2019ను ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ పత్రాల బ్రీఫ్ కేస్ మారింది. ఆ స్థానంలో ఎర్రటి పార్శిల్ లాంటి బ్యాగ్ వచ్చింది. పది లక్ష్యాలతో ఈ దశాబ్దానికి లక్ష్యాలను నిర్ణయించుకున్నాం. ఈ అంశాల స్ఫూర్తిగా ఈ బడ్జెట్ను రూపకల్పన చేశామని మంత్రి తెలిపారు.
బడ్జెట్-2019 ముఖ్యాంశాలు :
* 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థవైపునకు దూసుకెళ్తున్నాం
* ప్రస్తుతం భారత్ 2.5 లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థగల దేశంగా మారింది
* 1.9కోట్ల నివాసాల నిర్మాణం జరుగుతోంది. ఇళ్ల నిర్మాణ కాలాన్ని 114 రోజులకు తగ్గించాం.
గ్రామీణ భారతానికి ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నాం. 2022 నాటికి అన్ని నివాసాలకు విద్యుత్, గ్యాస్ సరఫరా
* జీరో బడ్జెట్ వ్యవసాయం (పెట్టుబడులు లేకుండా వ్యవసాయం) ప్రవేశపెడుతున్నాం.
* 'జలశక్తి మంత్రిత్వశాఖ' ఏర్పాటు. అన్ని నీటి వనరుల నిర్వహణ. 'హర్ ఘర్ జల్' పథకంలో భాగంగా నివాసాలకు నీటి సరఫరా.
* డీజిల్, పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం రూ.1 పెంపు.
* బంగారంపై కస్టమ్స్ సుంకం 10 నుంచి 12.50శాతానికి పెంపు
* 5 కోట్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగిన వారిపై సర్ఛార్జీ పెంపు
* ఆశ, విశ్వాసం, ఆకాంక్షల ప్రాతిపదికన గత ఐదేళ్లలో అదనంగా ఒక ట్రిలియన్ డాలర్లను ఆర్థిక వ్యవస్థకు జోడించాం.
* ప్రత్యక్ష పన్నులు, రిజిస్ట్రేషన్లో అనేక మార్పులు తెచ్చాం. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి సౌకర్యంతో స్వచ్ఛ భారత్ నిర్మితమైంది.
* మేకిన్ ఇండియాతో దేశంలో తయారీ పరిశ్రమ వేగమందుకుంది
* ప్రధానమంత్రి సడక్ యోజన, ఉడాన్, పారిశ్రామిక కారిడార్, రవాణా, రైల్వేలు ఇతర మార్గాలను నిర్మిస్తున్నాం
* ఇప్పటివరకూ దేశంలో 657కి.మీ.ల మెట్రో మార్గం ఉంది. మరో 300కి.మీ.ల మెట్రో మార్గానికి అనుమతులు లభించాయి
* ఒకే దేశం.. ఒకే గ్రిడ్ విధానంలో భాగంగా అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నాం
* గత ఐదేళ్లలోనే దేశ ఆర్థిక వ్యవస్థ విలువను లక్ష కోట్ల డాలర్లు పెంచాం. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో పారిశ్రామిక రంగం కీలక పాత్ర పోషిస్తోంది.
* ఎంఎస్ఎంఈలకు రూ.కోటి వరకూ రుణ సదుపాయం
* మినిమమ్ గవర్నమెంట్, మ్యాగ్జిమమ్ గవర్నన్స్ మా విధానం. పరిశ్రమలకు అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేస్తాం.
* ప్రధాన మంత్రి కర్మయోగి మాన్ధన్ యోజన ద్వారా చిల్లర వర్తకులకు పింఛన్ పథకం తీసుకువస్తాం.
* విదేశీ పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త విధానం. రెడ్ టేపిజం నియంత్రణకు చర్యలు
* మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా అంత్యోదయ పథకం మరింత విస్తరణ
* ఇస్రో సేవలను వాణిజ్యపరంగాను వృద్ధి చేసేందుకు ప్రత్యేక కంపెనీ. ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు. అంతరిక్ష ప్రయోగాల ఉత్పత్తులు, మార్కెటింగ్కు ప్రత్యేక వ్యవస్థ
* మీడియా, యానిమేషన్, విమానయాన రంగంలో ఎఫ్డీఐలపై పరిశీలన
* ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 78శాతం పెరిగాయి. 2018లో పన్ను వసూళ్లు రూ.11.37లక్షల కోట్లు
* మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి ప్రోత్సాహకాలు. రూ.45లక్షలులోపు గృహరుణాలపై రూ.3.5లక్షలు వడ్డీ రాయితీ. వడ్డీ రాయితీ రూ.2లక్షల నుంచి రూ.3.50లక్షలకు పెంపు
* విద్యుత్ వాహనాలపై జీఎస్టీని 12శాతం నుంచి 5శాతానికి తెచ్చే ఆలోచనలో ఉన్నాం.
* రూ.5లక్షల వరకు ఆదాయానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
* పన్నుల విధానంలో పారదర్శకత తీసుకొస్తాం. కార్పొరేట్ ట్యాక్స్ పరిధి రూ.400కోట్లకు పెంపు.
* దేశంలో మెగా మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లు. బ్యాటరీ, సౌరశక్తి రంగంలో విదేశీ కంపెనీలకు అనుమతి
* రూ.1,రూ.2,రూ.5,రూ.10,రూ.20 కొత్త నాణేలు తీసుకొస్తాం! చూపు లేని వారు కూడా గుర్తించే విధంగా ఇవి ఉంటాయి.
* ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ. లక్షా ఐదు వేల కోట్ల ఉపసంహరణకు నిర్ణయం

Related Posts