YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కుటుంబాన్ని కడతేర్చిన అనుమానం భార్యను చంపి..పిల్లల నోట్లో విషం పోసి..టేపు చుట్టి..భర్తఆత్మహత్య

కుటుంబాన్ని కడతేర్చిన అనుమానం భార్యను చంపి..పిల్లల నోట్లో విషం పోసి..టేపు చుట్టి..భర్తఆత్మహత్య

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని ఘజియాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో ప్రశ్నిస్తుందని భార్యను, ముగ్గురు పిల్లలను కడతేర్చాడో కర్కోటకుడు. తొలుత భార్య, పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక సూసైడ్‌ లేఖను ఘటనాస్థలంలో పెట్టి ప్రాణాలు తీసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ లేఖను స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్‌ లేఖలో ఉన్న సమాచారం ప్రకారం వివరాల ప్రకారం..ఘజియాబాద్‌ జిల్లాలోని ముసూరీ పరిథిలోని శతాబ్దిపురానికి చెందిన గురు అనే వ్యక్తి నిరుద్యోగి. ఆయన భార్య ఎయిమ్స్‌లో నర్సుగా పనిచేస్తున్నారు. గురుకు ఇతర మహిళలతో సంబంధం ఉండేదని అనుమానిస్తూ అతని భార్య రోజు ఆయనతో గొడవ పడుతుండేది. ఈ నేపథ్యంలో తాజాగా మళ్లీ వివాదం ఏర్పడటంతో ఆమెతో పాటు పిల్లల్నీ కడతేర్చాలని గురు నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలో ముందుగా భార్యను చంపి, ముగ్గురు పిల్లల నోట్లో విషం పోసి, అది బయటకు రాకుండా టేప్ చుట్టాడు. దీంతో ముగ్గురు పిల్లలు ఊపిరాడక ప్రాణాలు వదిలారు. తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబం అంతా ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో శతాబ్దిపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts