YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వంతెనపై నుంచి పడిన బస్సు: 29 మంది మృతి

వంతెనపై నుంచి పడిన బస్సు: 29 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ తెల్లవారుజామున దాదాపు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న యూపీ రోడ్‌వేస్‌ బస్సు.. ఆగ్రా సమీపంలో అదుపుతప్పి వంతెనపై నుంచి నాలాలో పడింది. ఈ ఘటనలో 29 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.లఖ్‌నవూ నుంచి దిల్లీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల పట్ల సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Related Posts