YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

స్టాక్ మార్కెట్లు నష్టాలు

స్టాక్ మార్కెట్లు నష్టాలు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

దేశీ స్టాక్‌మార్కెట్ బుధవారం కూడా తీవ్ర ఊగిసలాటలాడింది. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగొచ్చనే అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. మార్కెట్ ఆరంభంలోనే నష్టపోయింది. తర్వాత బెంచ్ మార్క్ సూచీలు బాగా ఊగిసలాటలాడాయి. చివరకు మార్కెట్‌ నష్టాల్లోనే ముగిసింది. సెన్సెక్స్ 174 పాయింట్ల నష్టంతో 38,557 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నిఫ్టీ 57 పాయింట్ల నష్టంతో 11,499 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మే 17 నుంచి చూస్తే నిఫ్టీ ఇండెక్స్ 11,500 మార్క్ దిగువకు పడిపోవడం ఇదే తొలిసారి. న్న ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. ట్రేడింగ్ మొదలైన తొలి గంటలో లాభాల్లో పయనించినప్పటికీ... ఆ తర్వాత సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 173 పాయింట్లు పతనమై 38,557కు పడిపోయింది. నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయి 11,498కి చేరింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యస్ బ్యాంక్ (1.81%), సన్ ఫార్మా (1.44%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (0.85%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.75%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.46%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-4.91%), టాటా స్టీల్ (-2.94%), టాటా మోటార్స్ (-2.79%), యాక్సిస్ బ్యాంక్ (-2.25%), వేదాంత లిమిటెడ్ (-0.96%).

Related Posts