YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కల్తీ నీరు సప్లయి చేస్తున్న వారిపై కొరడా 800 మంది అరెస్ట్

కల్తీ నీరు సప్లయి చేస్తున్న వారిపై కొరడా 800 మంది అరెస్ట్

రైళ్లలో మినరల్ వాటర్ పేరుతో నల్లా నీళ్లను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లపై రైల్వేశాఖ కొరడా ఝుళిపించింది. రైళ్లలో అందజేస్తున్న ఆహారపదార్థాలు, ఇతర సౌకర్యాలపై తనిఖీలు చేపట్టింది.  ఈ విషయమై కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 300 చోట్ల రైల్వే అధికారులు దాడులు చేశారని తెలిపారు. ఈ తనిఖీల్లో భాగంగా నాలుగు పాంట్రీ కార్ల మేనేజర్లతో పాటు 800 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. అలాగే కల్తీ నీరు ఉన్న 48,860 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ప్రయాణికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఈ తనిఖీలు చేపట్టామన్నారు.

Related Posts