YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాహుల్ కు కోటికిపైగా ఫాలోవర్స్.. సంబరాలు చేసుకున్న అభిమానులు

రాహుల్ కు కోటికిపైగా ఫాలోవర్స్..  సంబరాలు చేసుకున్న అభిమానులు

రాహుల్ గాంధీకి లోక్‌సభలోని ముందు వరుసలో సీటు కేటాయించాలని కాంగ్రెస్ కోరినట్టు జరుగుతోన్న ప్రచారంపై ఆ పార్టీ స్పందించింది. అసలు తామెప్పుడూ రాహుల్‌ గాంధీకి లోక్‌సభలో ముందు వరుసలో సీటు కేటాయించాలని డిమాండ్ చేయలేదని స్పష్టం చేసింది. రాహుల్‌ గానీ, పార్టీ గానీ ఈ విధమైన డిమాండ్‌ ఎప్పుడూ చేయలేదని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధరీ ట్విటర్‌లో వెల్లడించారు. మీడియాలో జరుగుతోన్న ప్రచారమంతా వదంతులేనని అన్నారు. సభలో ఆయన పార్టీల సంఖ్యా బలం ఆధారంగా ముందు వరుసలో సీట్లు కేటాయిస్తారు. ఈ విధానం ప్రకారం సోనియా గాంధీ, అధీర్‌ రంజన్‌ చౌధరీ కోసం ముందు వరుసలో రెండు సీట్లు కేటాయించారని.. రాహుల్‌ కోసం అదనంగా మరో సీటు ఇవ్వాలని ఆ పార్టీ డిమాండ్‌ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలు అవాస్తవమని చౌధరీ ట్విట్‌లో పేర్కొన్నారు. రాహుల్‌ కోసం తాము 466వ సీటును ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. అయితే ప్రస్తుత సమావేశాల్లో రాహుల్‌, సోనియాగాంధీ పక్క పక్కనే కూర్చుని కన్పించారు. మరోవైపు, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయానికి బాధ్యతవహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, రాజీనామాను వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాహుల్‌ తొలిసారిగా నేడు ఈ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ మరో అరుదైన ఘనతను సాధించారు. ట్విట్టర్‌లో రాహుల్ గాంధీని ఫాలోవర్ల వారి సంఖ్య కోటి (10 మిలియన్లకు)కి చేరింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ స్పందిస్తూ..‘ట్విట్టర్‌లో నా ఫాలోవర్ల సంఖ్య 10 మిలియన్లకు చేరుకుంది. వీరిలో ప్రతీఒక్కరికీ ధన్యవాదాలు. ఈ మైలురాయిని అందుకున్న నేపథ్యంలో అమేథీలో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి సంబరాలు జరుపుకుంటా. ఈరోజు అమేథీలో కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులతో భేటీ కాబోతున్నా’ అని ట్వీట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీచేసిన రాహుల్ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ చేతిలో ఓడిపోయారు. అయితే కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీచేసిన రాహుల్ విజయం సాధించారు.

Related Posts