YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కింకర్తవ్యం ఏంటి బాబూ..?

Highlights

  • ప్రత్యేక హోదా పై ఎలాంటి సందిగ్ధత వద్దు 
  • ఇప్పుడేం చేద్దాం: 
  • టీడీఎల్పీలో చంద్రబాబు 
  • గవర్నర్ ప్రసంగం పై ధన్యవాదం తెల్పనున్న బాబు
కింకర్తవ్యం ఏంటి బాబూ..?

ప్రత్యేక హోదానే మన విధానం ప్రత్యేక హోదా విషయంలో ఎలాంటి సందిగ్ధత అవసరంలేదని, హోదా సాధనే తమ విధానమని చంద్రబాబు నేతలతో అన్నట్లు తెలిసింది. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకాదనే సమాచారం కేంద్ర ఆర్థికశాఖ నుంచి వచ్చిన లీకుల నేపథ్యంలో దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.మంగళవారం సాయంత్రం అమరావతిలో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. సమస్యను కేంద్రం ఇంకా ఎందుకు జఠిలం చేస్తుందో తనకు అర్థంకావడం లేదని సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. తదుపరి వ్యూహంతో ఎలా ముందుకెళ్లాలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని నేతలకు సూచించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా  టీడీఎల్పీలో మూడురకాల ప్రశ్నలతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలను సీఎం కోరారు. కొంతకాలం వేచిచూద్దామా? లేదా పోరాటం కొనసాగిస్తూ ఒత్తిడి పెంచుదామా? అని ప్రశ్నించగా.. తెగదెంపులు చేసుకొనేలా తక్షణమే కీలక నిర్ణయం తీసుకుందామని మెజార్టీ సభ్యులు అన్నట్టుగా తెలుస్తోంది. ఇకపోతే, మరికొంతకాలం వేచిచూద్దామని ఆరుగురు సభ్యులు అన్నట్టుగా సమాచారం. కష్టమైనా, నష్టమైనా.. అంతా మీ వెనకే ఉంటామని నేతలంతా చంద్రబాబుతో అన్నట్టుగా తెలుస్తోంది. ప్రధాని హోదాలో తొలిసారి పార్లమెంట్ వద్దకు వెళ్లిన నరేంద్ర మోదీ పార్లమెంట్ ముఖద్వారం వద్ద చేసిన నమస్కారం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిందని, కానీ ఇప్పుడు రైతులు తమ వద్ద ఉన్న రూ.10వేలు కూడా బ్యాంకుల నుంచి తీసుకోలేని పరిస్థితి నెలకొందని ఎమ్మెల్యేలు తమ ఆవేదనను చంద్రబాబు వద్ద వెలిబుచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సమాధానం ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగానే మాట్లాడాలని నిర్ణయించారు. రేపు  గవర్నర్ ప్రసంగం పై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.

Related Posts