YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నేడు రాజ్యసభకు నామినేషన్ చేయనున్న వైసీపీ

Highlights

 

  •  టీడీపీకి  రెండు స్థానాలు, 
  • వైసీపికి ఒక స్థానం
నేడు రాజ్యసభకు నామినేషన్ చేయనున్న వైసీపీ

రాజ్యసభలో ఇటీవల ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేసేందుకు చేపట్టిన ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్ధిగా  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాష్ట్రానికి సంభందించిన మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కావడంతో వాటికి ఎన్నిక జరగనుంది. ఒక రాజ్యసభ స్థానానికి 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.సంఖ్యాబలం ప్రకారం అధికార టీడీపీ పార్టీకి రెండు స్థానాలు, ప్రతిపక్ష వైసీపికి ఒక స్థానం దక్కనున్నాయి. టీడీపీ ఇప్పటి వరకూ తమ అభ్యర్ధులను ప్రకటించలేదు. నెల్లూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తమ అభ్యర్ధిగా వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించింది. 

Related Posts