YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

ఇక బీజేపీతో తలాఖ్ తలాఖే..

Highlights

  • ఏపీపై మోదీకి కోపం 
  • చంద్రబాబుపై మోదీకి ఎందుకంత ఈర్ష్య
  • జేసీ దివాకర్‌‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇక బీజేపీతో తలాఖ్ తలాఖే..

బీజేపీతో పొత్తుపై నెలాఖరులోగా తెలుగుదేశం పార్టీ తలాఖ్ చేప్పే అవకాశం ఉందని ఆ పార్టీ సీనియర్ ఎంపీ  జేసీ దివాకర్‌‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.పార్లమెంట్‌ లోపల, బయట నిరసనలు కొనసాగిస్తామని, ప్రజలు కాంగ్రెస్‌పై చూపిన కోపాన్నే బీజేపీపైనా చూపిస్తున్నారని జేసీ అన్నారు. ప్యాకేజిలో చెప్పినవన్నీ ఇచ్చి ఉంటే హోదా అడిగేవాళ్లమా? అని దివాకర్‌రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అకారణమైన కోపం ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మోదీకి ఎందుకంత ఈర్ష్యో తెలియదు అన్నారు.  అలాగే ప్రజలను మోసం చేసేందుకే జగన్‌మోహన్‌రెడ్డి అవిశ్వాసం పెడుతున్నారని జేసీ విమర్శించారు.  
 

Related Posts