YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు

మళ్లీ తగ్గిన బంగారం ధరలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
 

పసిడి ధర మళ్లీ పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.10 పెరుగుదలతో రూ.36,180కు చేరింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ సహా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడం ధరపై సానుకూల ప్రభావం చూపింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరుగుదలతో రూ.33,170కు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం పరిగెత్తింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.505 పెరుగుదలతో రూ.41,065కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో ధరపై సానుకూల ప్రభావం పడింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.04 శాతం పెరుగుదలతో 1,412.75 డాలర్లకు ఎగసింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.12 శాతం క్షీణతతో 15.21 డాలర్లకు తగ్గింది. ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.10 పెరుగుదలతో రూ.35,060కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరుగుదలతో రూ.33,860కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర ఏకంగా రూ.505 పెరుగుదలతో రూ.41,065కు ఎగసింది.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి

Related Posts