YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రక్షణశాఖకు మాజీ ఉద్యోగి భారీ విరాళం

రక్షణశాఖకు మాజీ ఉద్యోగి భారీ విరాళం

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో: 

కేంద్ర రక్షణశాఖ నిధికి హైదరాబాద్‌కు చెందిన మాజీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి సీబీఆర్ ప్రసాద్ రూ.1.8కోట్లు భారీ విరాళాన్ని అందజేశారు. దిల్లీలో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను ఆయన నివాసంలో కలిసి చెక్ అందించారు. గతంలో ఎయిర్‌ఫోర్స్‌లో 108 నెలలు పనిచేసినందున రూ.108 లక్షల విరాళాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సీబీఆర్ ప్రసాద్ తెలిపారు. ఎయిర్స్ ఫోర్స్ ఉద్యోగం తర్వాత ఫౌల్ట్రీ వ్యాపారంలో కలిసి రావడంతో సంపాదించిన దానిని సామాజిక సేవకు వినియోగిస్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు తెలుగు రాష్ట్రాల్లో అకాడమీలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రసాద్‌ చెప్పారు. ఇప్పటికే కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేసిన క్రీడా అకాడమీలోని విద్యార్థులు జాతీయస్థాయిలో రాణిస్తున్నట్లు వివరించారు.

Related Posts