YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వాయిదా తీర్మానాన్ని కోరిన వైసీపీ

Highlights

  • ఉధృతమవుతున్న 'ప్రత్యేక'  పోరు
  • గాంధీ విగ్రహం వద్ద ధర్నా
     
వాయిదా తీర్మానాన్ని కోరిన వైసీపీ

ఏపీకి వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బుధవారం కూడా ఆందోళనలు కొనసాగించనున్నారు. ఈ విషయమై వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి బుధవారం లోక్ సభలో  వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చారు. ఐదు కోట్ల ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ఇప్పటికే హోదా ఉద్యమ సెగలు పార్లమెంటును తాకిన సంగతి తెలిసిందే. విభజన కారణంగా జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి హోదా తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని నినదిస్తూ నాలుగేళ్లుగా అనేక రూపాలలో పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు వేదికగా తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. పార్లమెంటు వెలుపల, లోపల ఆందోళనలతో ఆ పార్టీ ఎంపీలు హోరెత్తిస్తున్నారు. సభలో 184 నిబంధన కింద నోటీసు ఇచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వాలి అని రాసి ఉన్న ప్లకార్డులతో స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు.

Related Posts