YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

తమిళనాడులోని విల్లుపురంలోని అన్నా ఫ్లె ఓవర్ వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మినీ వ్యాన్ - ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 14 మంది కార్మికులు కంచీపురం జిల్లా నుంచి తిరువూరు జిల్లాకు విద్యుత్ టవర్ల నిర్మాణ పనులకు ట్రక్కులో తరలివెళ్తున్నారు. కోయంబత్తూరు నుంచి చెన్నైకు వెళ్తున్న మినీ వ్యాన్‌లో 26 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అయితే కల్లాకుర్చి వద్ద ఈ రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ ఎం. మణికండన్, వ్యాన్ డ్రైవర్ ఏ. రాజేంద్రన్‌తో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే 14 మంది కార్మికుల్లో 11 మంది జార్ఖండ్‌కు చెందినవారు ఉన్నారు. ఈ ప్రమాదంతో కల్లాకుర్చి - సేలం జాతీయ రహదారిపై మూడుగంటల పాటు ట్రాఫిక్‌జాం ఏర్పడింది. కల్లాకుర్చి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Related Posts