YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిన్న మాట్లాడుతూ, విదేశీ సంస్థాగత మదుపరులు కొత్త పన్నుల విధానంలో సర్ ఛార్జుల భారాన్ని తొలగించుకోవాలంటే ఇక్కడ తమ కంపెనీలను రిజిస్టర్ చేయించుకోవాలని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 560 పాయింట్లు పతనమై 38,337కి పడిపోయింది. నిఫ్టీ 177 పాయింట్లు కోల్పోయి 11,419కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (2.32%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.61%), టీసీఎస్ (0.55%), ఓఎన్జీసీ (0.42%).
టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-4.36%), బజాజ్ ఫైనాన్స్ (-4.16%), టాటా మోటార్స్ (-3.73%), హీరో మోటో కార్ప్ (-3.71%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.40%).

Related Posts