YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

వినియోగదారులను పెంచుకుంటున్న జియో

వినియోగదారులను పెంచుకుంటున్న జియో

 రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ ను అధిగమించి మొత్తం 32.29 కోట్ల మంది వినియోగదారులతో రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఈ విషయాన్ని ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) వెల్లడించింది. ఐడియా, వోడాఫోన్ విలీనం తరువాత ఏర్పడిన సంస్థ తొలి స్థానంలో 38.75 కోట్ల మంది వినియోగదారులతో వైర్ లెస్ సెగ్మెంట్ లో తొలి స్థానంలో ఉంది. అయితే, ఇదే సమయంలో వోడాఫోన్-ఐడియా వినియోగదారుల సంఖ్య 39.32 కోట్ల నుంచి 38.75 కోట్లకు తగ్గడం గమనార్హం. ఏప్రిల్ గణాంకాలను విడుదల చేసిన ట్రాయ్, వోడాఫోన్-ఐడియా వినియోగదారుల సంఖ్య 56 లక్షలకు పైగా తగ్గిందని తెలిపింది.

Related Posts