Highlights
- ఈడీ ఉత్తర్వులు కొట్టివేత
- జప్తును తప్పు పట్టిన ట్రైబ్యునల్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగతి పబ్లికేషన్లో ముగ్గురు వ్యాపారులకు సంబంధించి పెట్టుబడుల వ్యవహారంలో 34.64 కోట్ల రూపాయలను ఈడీ తాత్కాలిక జప్తు చేయడాన్ని అప్పీలేట్ ట్రైబ్యునల్ తప్పు పట్టింది. ఈడీ ఉత్తర్వులను కొట్టివేసింది. మోసపూరితంగా పెట్టుబడులు స్వీకరిస్తే మనీలాండరింగ్ ఎలా అవుతుందని ప్రశ్నించింది. దీంతో జగన్ అక్రమాస్తుల కేసులో అప్పీలేట్ ట్రైబ్యునల్లో ఈడీకి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. జగతి పబ్లికేషన్స్కు సంబంధించిన రూ. 34.64 కోట్లను తాత్కాలిక జప్తు చేస్తూ 2013లో ఈడీ జారీ చేసిన ఉత్తర్వులను ట్రైబ్యునల్ కొట్టివేసింది. జగతి పబ్లికేషన్స్లో టీఆర్ కణ్ణన్, ఏకే దండమూడి, మాధవ్ రామచంద్రన్ అనే ముగ్గురు వ్యాపారులు 34.64 కోట్లు పెట్టబడులు పెట్టారు.