YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

1000 కోట్లు ఆస్తులు ఇచ్చేయండి

1000 కోట్లు ఆస్తులు ఇచ్చేయండి

యువ న్యూస్ జనరల్ బ్యూరో:

ఎంసీ కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ జప్తు చేసిన తన ఆస్తులన్నీ తిరిగిచ్చేయాలని కోరారు గాలి జనార్దన్‌రెడ్డి. ఓ కేసు విచారణలో భాగంగా సోమవారం ఆయన బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు.  ఈడీ జప్తు చేసిన ఆస్తులన్నింటినీ తిరిగిచ్చేయాలని కర్ణాటక హైకోర్టు ఆదేశించిందని, అయితే ఆ తీర్పుపై ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసిందని తెలిపారు.కర్ణాటక హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించినా రూ.వెయ్యికోట్ల విలువైన తన ఆస్తులను తిరిగిచ్చేందుకు ఈడీ జాప్యం చేస్తోందని గాలి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. వీలైనంత త్వరగా తన ఆస్తులపు అప్పగించకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఆయన హెచ్చరించారు. తాను విచారణ కోసం రాలేదని, తన ఆస్తులు అప్పగించాలని ఈడీని కోరేందుకు వచ్చానని చెప్పారు. ఓఎంసీ కేసులో నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తన సహాయకుడు అలీఖాన్‌తో కలిసి ఖరీదైన కారులో బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఆయనకు రక్షణగా ఓ పోలీసు వాహనం కూడా వచ్చింది. ఇనుప ఖనిజం విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారంలో విదేశీ మారక ద్రవ్యం వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనపై
గతంలో కేసులు నమోదు చేసింది. ఈ కేసుల విచారణలో భాగంగానే గాలి ఈడీ అధికారుల ఎదుట హాజరైనట్లు తెలుస్తోంది. సుమారు ఐదు గంటల తర్వాత ఆయన ఈడీ ఆఫీసు నుంచి తిరిగి వెళ్లిపోయారు.

Related Posts