YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అమిత్‌షాను కలిసిన మాజీ ఎంపీ వివేక్‌

అమిత్‌షాను కలిసిన మాజీ ఎంపీ వివేక్‌

 యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను పెద్దపల్లి మాజీ పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ మంగళవారం ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సచివాలయం కూల్చివేత
నిర్ణయంపై అమిత్‌షాకు వివేక్ ఫిర్యాదు చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేస్తోందంటూ వివేక్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వివేక్ త్వరలో బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే ఆయన అమిత్ షాను కలిశారని, వచ్చే నెలలో ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Related Posts