YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోడీకి ఆటోమొబైల్ సంస్థల లేఖ

మోడీకి ఆటోమొబైల్ సంస్థల లేఖ

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో: 

కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలు పోకుంటే చాలు అనుకునే పరిస్థితులు వచ్చాయి. దేశంలో వాహన పరిశ్రమలో 10 లక్షల ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉంది. ఆటోమొబైల్ రంగంలో మందగమనం కొనసాగితే వీరందరూ ఉపాధి కోల్పోయే ప్రమాదముందని ఏసీఎంఏ ప్రెసిడెంట్ రామ్ వెంకటరమణి తెలిపారు. వాహన విడిభాగాల పరిశ్రమ పనితీరు గురించి మాట్లాడుతూ ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆటోమోటివ్ పరిశ్రమ మందగమనంలో ఉంది. అన్ని విభాగాల్లోనూ వాహన విక్రయాలు పడిపోయాయి. గత 11 నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో కంపెనీలు ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. ఆటోమొబైల్ పరిశ్రమపై వాహన విడిభాగాల పరిశ్రమ ఆధారపడి ఉండటంతో ఈ రంగంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోంది. వాహన విడిభాగాల పరిశ్రమలో దాదాపు 70 శాతం మంది కాంట్రాక్టు వర్కర్లే ఉంటారని, డిమాండ్‌ లేకపోతే సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవడం జరుగుతుందని వెంటకరమణి తెలిపారు. 50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ స్థూల దేశీయోత్పత్తిలో 2.3 శాతం వాటాతో ఆటోమోటివ్‌ పరికరాల తయారీ పరిశ్రమ దేశ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. డిమాండ్ మందగించడం, బీఎస్ 6 ప్రమాణాలకు అప్‌గ్రేడ్ కోసం ఇన్వెస్ట్‌మెంట్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్‌ పాలసీపై స్పష్టత లేకపోవడం వంటి అంశాల కారణంగా వాహన పరిశ్రమలో అనిశ్చితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల కంపెనీలు భవిష్యత్ పెట్టుబడులకు దూరంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటోమొబైల్, వాహన విడిభాగాల పరిశ్రమ మళ్లీ వృద్ధి బాట పట్టేందుకు మోదీ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి వెంకటరమణి కోరారు. డిమాండ్ పెరుగుదలకు తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు. బీఎస్ 6 ప్రమాణాలకు అప్‌గ్రేడ్ అయిన తర్వాత వాహన ధరలు పెరిగే అవకాశముందని అందువల్ల ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని సూచించారు. అలాగే ఆటోమొబైల్, వాహన విడిభాగాల పరిశ్రమలపై జీఎస్‌టీ రేటును 18 శాతంగా ఉంచాలని కోరారు. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి స్థిరమైన పాలసీని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

Related Posts