YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మహారాష్ట్రలో ఎన్సీపీకి షాక్

మహారాష్ట్రలో ఎన్సీపీకి షాక్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ)కి భారీ షాక్‌ తగిలింది. ఎన్సీపీ ముంబై చీఫ్‌ సచిన్‌ అహీర్‌.. శివసేన పార్టీలో చేరారు. ఇవాళ ఉదయం శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే, ఆయన కుమారుడు ఆదిత్య థాకరే సమక్షంలో సచిన్‌ అహీర్‌ ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సచిన్‌ అహీర్‌కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. శివసేనలోకి సచిన్‌ అహీర్‌ రాకతో.. ముంబైలోని వోర్లిలో ఆ పార్టీ మరింత బలపడే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో సచిన్‌కు విశేషమైన ఆదరణ ఉంది. ఇక ఎన్సీపీ నాయకుడు చగన్‌ భుజ్బల్‌ కూడా శివసేన చేరే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్సీపీలో చేరే కంటే ముందు భుజ్బల్‌ శివసేనలో 25 ఏళ్ల పాటు కొనసాగారు. మళ్లీ ఇప్పుడు భుజ్బల్‌ శివసేనలో చేరుతారని తెలుస్తోంది.

Related Posts