YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వ్యవసాయానికి రూ. రూ. 19,070 కోట్లు 

Highlights

  • సభలో ప్రవేశపెట్టిన మంత్రి సోమిరెడ్డి 
వ్యవసాయానికి రూ. రూ. 19,070 కోట్లు 


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రవేశపెట్టారు. రూ. 19,070 కోట్లతో ఆయన వ్యవసాయ చిట్టాపద్దును గురువారం శాసనసభ ముందు ఉంచారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఈ సందర్భంగా  మంత్రి సోమిరెడ్డితెలిపారు.

వ్యవసాయ బడ్జెట్‌లోని విశేషాలు ఇవి..

రూ.19.070 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం 
రెవిన్యూ వ్యయం రూ.18,602 కోట్లు
పెట్టుబడి వ్యయం రూ.468.38 కోట్లు
వ్యవసాయ అనుబంధ రంగాలకు 4.730 ​కోట్లు
మొక్కజొన్న ఉత్పత్తి లో దేశంలో ఏపీ రెండో స్థానం
వరి ఉత్పత్తిలో దేశంలో మూడో స్థానంలో ఏపీ
రసాయన ఎరువుల వాడకంలో దేశంలో ఆరో స్థానం
రైతులకు 100శాతం రాయితీతో సూక్ష్మపోషకాల పంపీణి
నాణ్యమైన విత్తనాల సరఫరా కోసం ఆధార్‌ అనుసంధానం
రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు అగ్రిటెక్ ఏర్పాటు
బత్తాయి ఉత్పతిలో ద్వితియ స్థానం
సూక్ష్మపోషకాల సవరణకు రూ.60కోట్లు
అర్హులైన ప్రతిరైతుకు రుణమాఫీ
రుణమాఫీ కోసం​ 4,100 కోట్లు
వేరుశనగ విత్తనాలకు 90 శాతం రాయితీ
విత్తన రాయితీలు రూ.220కోట్లు
పట్టు పరిశ్రమకు  రూ.175 కోట్లు
మత్స్యశాఖకు రూ.386 కోట్లు
కరువు నివారణకు  రూ. 1042 కోట్లు
వ్యవసాయ మార్కెటింగ్‌ టెక్నాలజీకి రూ. 35 కోట్లు
ఎరువు కొరత నివారణకు రూ.45 కోట్లు
పశుసంవర్థనశాఖకు రూ.1225 కోట్లు
మెగా సీడ్‌పార్క్‌కు రూ.100 కోట్లు
పావలా వడ్డి రుణాలకు రూ.5 కోట్లు
చంద్రన్న రైతు క్షేత్రాకు రూ.15 కోట్లు
ప్రధాన  ఫసల్‌ బీమా  యోజన రూ.485 కోట్లు
రైతులకు వడ్డీలేని రుణాలకు రూ.172 కోట్లు
వ్యవసాయ యాంత్రికరణకు రూ.258 కోట్లు

Related Posts