YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఫిక్స్‌ డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించిన ఎస్‌బీఐ

ఫిక్స్‌ డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించిన ఎస్‌బీఐ

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్‌ ఎస్‌బీఐ ఫిక్స్‌ డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించింది. మిగులు ద్రవ్యం, తగ్గుతున్న వడ్డీరేట్లను ఇందుకు కారణంగా చూపింది. తక్కవ కాలపరిమితి కలిగిన (179 రోజుల్లోపు) డిపాజిట్లపై 50 నుంచి 75 బేసిస్‌ పాయింట్లను తగ్గించింది. ఆపై కాలపరిమితి కలిగిన రిటైల్‌ డిపాజిట్లపై 20 బేసిస్‌ పాయింట్లు.. బల్క్‌ సెగ్మెంట్‌లో 35 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. రూ.2కోట్లు ఆపై బల్క్‌ డిపాజిట్లపైనా వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. సవరించిన వడ్డీరేట్లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది.ఇప్పటి 7 రోజుల నుంచి 45 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 5.75 % అందిస్తున్న వడ్డీని 5%కి ఎస్‌బీఐ తగ్గించింది. 46 నుంచి 179 కాలపరిమితి డిపాజిట్లపై 6.25% ఉన్న వడ్డీ రేటును 5.75% కు, 180 నుంచి 210 రోజుల కాలపరిమితి డిపాజిట్లపై 10 బేసిస్‌ పాయింట్లు కోత విధించి 6.25% వడ్డీ అందించనుంది. 211 రోజుల నుంచి ఏడాది డిపాజిట్లపై 6.40%గా ఉన్న వడ్డీ రేటును 6.25%కి తగ్గించింది. ఏడాది నుంచి రెండేళ్ల కాలపరిమితి ఉన్న డిపాజిట్లపై 7%గా ఉన్న వడ్డీ రేటును 6.80%తగ్గించింది. 10 ఏళ్ల వరకు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై  మార్పులు చేసింది. చివరి సారిగా ఈ ఏడాది మే నెలలో ఎస్‌బీఐ వడ్డీరేట్లను సవరించింది.

Related Posts