Highlights
- సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు
- పెరుగుతున్న ఎండలతో అప్రమత్తం
- వాతావరణ కేంద్రం అధికారులు సూచన
మర్చి ఆరంభంలోనే బాలభానుడు తన ప్రతాపాన్ని చూపించండంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పుడే ఇంతగా ఎండలు మండిపోతే ముందు ముందు ఎలాతట్టుకోవాలని వాపోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మధ్యాహ్నం వేళల్లో బయటకు రావడానికి సంసహిస్తున్నారు. అత్యవసర పనిపడితే తప్ప ప్రజలు అడుగు బయట పెట్టడానికి వెనుకంజ వేస్తున్నారు. ఏప్రిల్, మే నెలలో ఎలా ఉంటాయో అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గురువారం హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెరుగుతున్న ఎండలతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు సూచిస్తున్నారు.