YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ట్రిపుల్‌ తలాక్‌ ఎఫెక్ట్‌: కాంగ్రెస్‌ ఎంపీ రాజీనామా

ట్రిపుల్‌ తలాక్‌ ఎఫెక్ట్‌: కాంగ్రెస్‌ ఎంపీ రాజీనామా

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

 కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఆయన ప్రకటించారు. అమిత్‌ షా సమక్షంలో రేపు బీజేపీ చేరబోతున్నట్లు కూడా ఆయన తెలిపారు. కాగా ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై కాంగ్రెస్‌ పార్టీ వైఖరికి నిరసనగానే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లును రాజ్యసభలో కాంగ్రెస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని అమేథికి చెందిన సంజయ్‌ దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు. తాజాగా ఆయన రాజీనామాతో పార్టీ నేతలు షాక్‌కిగురయ్యారు.

Related Posts