YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

గ్యాంగ్ స్టర్ కు సహకరించిన టీడీపీ మాజీఎమ్మెల్యే

 గ్యాంగ్ స్టర్ కు సహకరించిన టీడీపీ మాజీఎమ్మెల్యే

హత్యలు, అఘాయిత్యాలు, భూకబ్జాలు, సెటిల్‌మెంట్లతో తెలుగు రాష్ట్రాల్లో గ్యాంగ్‌స్టర్‌గా చెలామణి అయిన నయీంను మూడేళ్ల క్రితం తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అతడి కేసు విచారిస్తున్న పోలీసులకు ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చారు. అయితే ఈ కేసు దర్యాప్తుపై ఇప్పటికీ చాలామందికి అనేక అనుమానాలున్నాయి. నయీం కేసులో అసలు ఎవరెవరి పేర్లున్నాయో తెలుసుకునేందుకు ‘ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌’ అనే సంస్థ సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా వివరాలు రాబట్టింది.ఆ సంస్థ సేకరించిన నివేదికలోని పేర్లు చూసి ఇప్పుడు అందరూ నోరెళ్లబెడుతున్నారు. ప్రజాప్రతినిధులతో పాటు అనేక మంది పోలీసుల పేర్లు కూడా అందులో ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య
అడిషనల్‌ ఎస్పీలు.. శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌, అమరేందర్‌రెడ్డి డీఎస్పీలు శ్రీనివాస్‌, సాయిమనోహర్‌రావు, శ్రీనివాసరావు, ప్రకాష్‌రావు, వెంకటనర్సయ్య పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న ఇన్స్‌పెక్టర్లు మస్తాన్‌, శ్రీనివాసరావు, మాజీద్‌, వెంకట్‌రెడ్డి, వెంకటసూర్యప్రకాష్‌, రవికిరణ్‌రెడ్డి, బల్వంతయ్య, బాలయ్య, రవీందర్‌, నరేందర్‌గౌడ్‌, దినేష్‌, సాదిఖ్‌మియా భువనగిరి కౌన్సిలర్‌ అబ్దుల్‌ నాజర్‌, మాజీ కౌన్సిలర్‌ శ్రీనివాస్‌, మాజీ జెడ్పీటీసీ సుధాకర్‌, మాజీ ఎంపీపీలు నాగరాజు, వెంకటేష్‌, మాజీ సర్పంచ్‌ పింగల్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సంజీవ్, వెల్దండ టీఆర్‌ఎస్‌ ప్రెసిడెంట్‌ ఈశ్వరయ్య గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్ జరిగిన మూడేళ్ల కావొస్తోంది. 2016, ఆగస్టు 8 షాద్‌నగర్‌ శివారులోని మిలీనియం టౌన్‌షిప్‌లో పోలీసులు అతడిని కాల్చి చంపారు. ఉదయం వేళ ఒక్కసారిగా వందల మంది పోలీసులు టౌన్‌షిప్‌ను చుట్టుముట్టడంతో స్థానికులు బెదిరిపోయారు. ఏం జరుగుతుందో తెలిసేలోగానే పోలీసులు నయీం గ్యాంగ్‌ను కాల్చి చంపేశారు. కరుడుగట్టిన నేరస్థుడైన నయీం తమ ఇళ్ల మధ్యే ఉంటున్నాడని తెలిసి స్థానికులు షాక్‌కు గురయ్యారు.

Related Posts