YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నడిరోడ్డుపై తలాక్..మొదటి శిక్ష

నడిరోడ్డుపై తలాక్..మొదటి శిక్ష

ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు 2019 పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ నిషేధ బిల్లు చట్టంగా మారింది. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే కేసు నమోదయ్యింది. కట్నంగా రూ. లక్ష ఇవ్వలేదని నడిరోడ్డుపైనే భార్యకు మూడుసార్లు తలాక్ చెప్పిన ఘటన గురువారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో చోటుచేసుకుంది. మథుర సీనియర్ సూపరింటెండెంట్ శలభ్ మాథుర్ తెలిపిన వివరాల ప్రకారం.. కోసీకి చెందిన జుమిరాత్‌కు మేవాత్‌ ప్రాంతానికి చెందిన ఇక్రమ్‌తో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, పెళ్లి సమయంలో ఇవ్వాల్సిన కట్నానికి సంబంధించి కొంతకాలంగా ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వివాదాన్ని పరిష్కరించడానికి గురువారం పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. కట్నం కింద రూ. లక్ష ముట్టజెప్పితేనే జుమిరాత్‌ను భార్యగా అంగీకరిస్తానని ఇక్రమ్ మొండికేశాడు. జుమిరాత్ కుటుంబం కట్నం ఇవ్వడానికి అంగీకరించలేదు. దీంతో ఇక్రమ్ నడిరోడ్డుపైనే జుమిరాత్‌కు మూడుసార్లు తలాక్ చెప్పి వెళ్లిపోయాడు. ఈ విషయమై జుమిరాత్ తల్లి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం 2019లోని సెక్షన్ 4 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టం ప్రకారం మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తారు. నేరం రుజువైతే తలాక్ చెప్పిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు

Related Posts